సీఎం రేవంత్ రెడ్డితో వైఎస్ షర్మిల భేటీ

by Disha Web Desk 2 |
సీఎం రేవంత్ రెడ్డితో వైఎస్ షర్మిల భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, షర్మిల పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డిని కలవడం గమనార్హం. ఇరువురి మధ్య తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. కృష్ణా జలాల అంశంపైన కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇంతకుముందు కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఇంటికి వెళ్లి మరీ కలిశారు వైఎస్ షర్మిల. తన తనయుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుక, వివాహానికి రావాల్సిందిగా ఆమె, సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. తాజాగా.. రెండు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల హడావుడి ప్రారంభమైన వేళ వీరిద్దరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

Next Story

Most Viewed